అదనంగా నగదు వసూలు చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

అదనంగా నగదు వసూలు చేయొద్దు

Apr 26 2025 12:17 AM | Updated on Apr 26 2025 12:17 AM

అదనంగా నగదు వసూలు చేయొద్దు

అదనంగా నగదు వసూలు చేయొద్దు

జేసీ కార్తీక్‌

నెల్లూరు(అర్బన్‌): గ్యాస్‌ సిలిండర్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా వినియోగదారుల నుంచి డెలివరీ బాయ్స్‌ అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గ్యాస్‌ ఏజెన్సీల నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేసినట్టు వస్తున్న ఫిర్యాదులపై స్పందించని ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్‌ బుకింగ్‌ చేసిన వెంటనే వారికి సకాలంలో సిలిండర్‌ డెలివరీ చేయాలని సూచించారు. వినియోగదారులందరూ సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీల్లో ఈకేవైసీ పూర్తి చేయించుకోవాలని కోరారు. అనంతరం ఐవీఆర్‌ఎస్‌ సర్వే గురించి సమీక్షించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement