
కల్వర్టును ఢీకొని..
సంగం: మండలంలోని సంగం – కలిగిరి రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కలిగిరి నుంచి నెల్లూరు వెళ్తున్న కారు సంగం మలుపు వద్ద అతివేగంతో కల్వర్టును ఢీకొని పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. స్థానికులు స్పందించి అందులో ఉన్న నలుగురిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే 108 అంబులెన్స్లో ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. బాధితులను నెల్లూరుకు చెందిన క్రాంతికుమార్, రేవంత్, జస్వంత్, అజయ్కుమార్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దగ్ధమైన కారును ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.రాములు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు.
కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడిన కారు
మంటలు చెలరేగి నలుగురికి గాయాలు