మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ | Vaibhav Sooryavanshi Angrily Scolds Fan | Sakshi
Sakshi News home page

మీకు దండం పెడతా? కోపంతో ఊగిపోయిన వైభ‌వ్ సూర్య‌వంశీ

Jun 6 2026 11:43 AM | Updated on Jun 6 2026 11:52 AM

Vaibhav Sooryavanshi Angrily Scolds Fan

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో మెరుపులు మెరిపించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఇప్పుడు  భారత్-ఎ జట్టు త‌ర‌పున స‌త్తాచాటేందుకు సిద్ద‌మ‌య్యాడు. అఫ్గానిస్తాన్-ఎ, శ్రీలంక జట్లతో జరగబోయే ముక్కోణ‌పు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో భారత బృందం శనివారం లంక గడ్డపై అడుగుపెట్టింది.

ఇందులో వైభవ్ కూడా ఉన్నాడు. అయితే దంబుల్లా ఎయిర్ పోర్ట్ వెలుపుల సూర్య‌వంశీకి ఓ చేదు అనుభ‌వం ఎదురైంది. ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టడంతో సూర్యవంశీ అసహనానికి గురయ్యాడు. ఈ యువ క్రికెట‌ర్ త‌న ల‌గేజ్‌తో పాటు బ‌స్సు వైపు వెళ్తుండ‌గా, ఫ్యాన్స్ 'సెల్ఫీ'ల కోసం ఎగబడ్డారు. 

దీంతో తన సహనం కోల్పోయిన వైభవ్.. చేతులు జోడించి ఓ అభిమానిని దయచేసి దూరంగా వెళ్లండని కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ ట్రైసిరీస్‌లో భారత-ఎ జట్టు తిలక్ వర్మ కెప్టెన్సీలో ఆడనుంది. 

ఈ జట్టులో సూర్యవంశీతో పాటు ఐపీఎల్ స్టార్స్ ప్రియాన్ష్‌ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. మే 9న దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనలకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించనుంది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.



 

 

Advertisement
 
Advertisement
Advertisement