"గౌతమ్‌ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్‌ బెదిరింపులు | Team India Head Coach Gautam Gambhir Receives Death Threat Mail From ISIS After Pahalgam Terror Attack | Sakshi
Sakshi News home page

Pahalgam Incident: "గౌతమ్‌ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్‌ బెదిరింపులు

Apr 24 2025 10:03 AM | Updated on Apr 24 2025 10:59 AM

Team India Head Coach Gautam Gambhir Receives Death Threats

భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ కశ్మీర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్‌ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్‌ చేసింది. ఈ విషయాన్ని గంభీర్‌ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. 

ఢిల్లీలోని రాజీందర్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్‌ ఢిల్లీ పోలీసులను కోరాడు.

గంభీర్‌ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.

కాగా, ఐపీఎల్‌ కారణంగా గంభీర్‌ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్‌ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్‌ చేసి వచ్చాడు. గంభీర్‌ గతేడాది జులైలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్‌ టీ20 వరల్డ్‌కప్‌ గెలిచాక రాహుల్‌ ద్రవిడ్‌ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. 

టీమిండియా కోచ్‌గా గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్‌ నేతృత్వంలో భారత్‌.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ల్లో ఓటమిపాలైంది.  మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్‌ గంభీర్‌ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement