Vijay Hazare Trophy: ధావన్‌ ఆల్‌రౌండ్‌ షో.. తొలిసారి ఫైనల్లో హిమాచల్‌ ప్రదేశ్‌

Rishi Dhawans all round show takes Himachal Pradesh to Vijay Hazare Trophy final, to face TN - Sakshi

జైపూర్‌: దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో హిమాచల్‌ ప్రదేశ్‌ జట్టు తొలిసారి... ఐదుసార్లు చాంపియన్‌ తమిళనాడు జట్టు ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాయి. సెమీఫైనల్స్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌ 77 పరుగుల ఆధిక్యంతో సర్వీసెస్‌ జట్టుపై... తమిళనాడు రెండు వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై గెలుపొందాయి.

ఫైనల్‌ రేపు జరుగుతుంది. సర్వీసెస్‌తో జరిగిన సెమీఫైనల్లో హిమాచల్‌ కెప్టెన్‌ రిషి ధావన్‌ ఆల్‌రౌండ్‌ షో (84; 9 ఫోర్లు, 1 సిక్స్‌;  4/27) కనబరిచాడు. మొదట హిమాచల్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 281 పరుగులు చేసింది. సర్వీసెస్‌ 46.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. మరో సెమీస్‌లో సౌరాష్ట్ర నిర్దేశించిన 311 పరుగుల లక్ష్యాన్ని తమిళనాడు ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.

చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top