Pro Kabaddi League: బెంగళూరు బుల్స్‌ జోరు.. తొమ్మిదో విజయం

Pro Kabaddi League 2021 2022: Bengaluru Bulls Beat UP Yoddha 9th Win - Sakshi

Pro Kabaddi League 2021- 2022: Bengaluru Bulls Beat UP Yoddha: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌ జట్టు తొమ్మిదో విజయం సాధించింది. యూపీ యోధతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 31–26 పాయింట్ల తేడాతో గెలిచింది. బెంగళూరు కెప్టెన్‌ పవన్‌ సెహ్రావత్‌ తొమ్మిది పాయింట్లు స్కోరు చేయగా... డిఫెండర్‌ అమన్‌ ఏడు పాయింట్లు సాధించాడు.

ఇక యూపీ యోధ తరఫున శ్రీకాంత్‌ జాదవ్, నితీశ్‌ కుమార్‌ ఆరు పాయింట్ల చొప్పున స్కోరు చేశారు. అదే విధంగా... మరో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ 25–34 తో గుజరాత్‌ జెయింట్స్‌ చేతిలో ఓడిపోయింది. 

చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్‌ వేటలో.. అండర్‌-19 టీమిండియా
IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్‌, మనీశ్ రెడ్డి.. ఇంకా..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top