
కొలంబో వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో శ్రీలంక(Sri Lanka) ఘన విజయం సాధించింది. 211 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 78 పరుగుల వెనకుబడడంతో బంగ్లా ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
115/6 ఓవర్ నైట్స్కోర్తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్ అదనంగా 18 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్స్ను ముగించింది. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు దనుంజయ డి సిల్వా, రత్నాయకే రెండు వికెట్లు సాధించారు.
బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(26) పరుగులతో టాప్ స్కోరర్ నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 290/2తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక చివరకు 116.5 ఓవర్లలో 458 పరుగులకు ఆలౌటైంది. పాథుమ్ నిసాంక (254 బంతుల్లో 158; 19 ఫోర్లు) క్రితం రోజు స్కోరుకు మరో 12 పరుగులు జోడించి వెనుదిరగగా... వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (87 బంతుల్లో 84; 8 ఫోర్లు, 2 సిక్స్లు) ధనాధన్ హాఫ్సెంచరీతో అదరగొట్టాడు.
కమిందు మెండిస్ (41 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 5 వికెట్లు పడగొట్టగా... నయీమ్ హసన్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ జట్టు 247 పరుగులు చేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సైకిల్లో శ్రీలంకకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.
చదవండి: గెలిచిన మ్యాచ్లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్