కావ్యా మారన్‌ జట్టులో పాక్‌ ఆటగాళ్లు.. వివాదంలో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ | Mohammad Amir And Imad Wasim In Kavya Maran's Team Ignites Spark Of A Brewing Controversy, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కావ్యా మారన్‌ జట్టులో పాకిస్తాన్‌ ఆటగాళ్లు.. వివాదంలో చిక్కుకున్న ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్

Aug 5 2025 1:18 PM | Updated on Aug 5 2025 1:29 PM

Mohammad Amir, Imad Wasim In Kavya Maran's Team Ignites Spark Of A Brewing Controversy

కావ్యా మారన్నేతృత్వంలోని సన్గ్రూప్ఇంగ్లండ్వేదికగా జరిగే హండ్రెడ్లీగ్లో నార్త్రన్సూపర్ఛార్జర్స్అనే ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఫ్రాంచైజీలో మొత్తం వాటాను సన్గ్రూప్రూ. 1,094 కోట్లకు చేజిక్కించుకుంది. హండ్రెడ్లీగ్లోని 8 ఫ్రాంచైజీల్లో నాలుగింటిని భారత కంపెనీలు (ఐపీఎల్ఫ్రాంచైజీ ఓనర్లు కూడా) కొనుగోలు చేయగా.. మరో రెండు ఫ్రాంచైజీలను భారతీయ-అమెరికన్ పెట్టుబడిదారులు సొంతం చేసుకున్నారు.

ఇంతవరకు అంతా బాగానే ఉంది. ఇవాల్టి నుంచి (ఆగస్ట్‌ 5) ప్రారంభం కాబోయే 2025 సీజన్కోసం కావ్యా మారన్‌ ఓనర్షిప్లోని నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఇద్దరు పాకిస్తాన్మాజీ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంతో వివాదం మొదలైంది. నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ బెన్డ్వార్షుయిస్‌ (ఆస్ట్రేలియా), మిచెల్సాంట్నర్కు (న్యూజిలాండ్‌) ప్రత్యామ్నాయంగా పాక్మాజీలు మొహమ్మద్ఆమిర్‌, ఇమాద్వసీంలను ఎంపిక చేసుకొని భారత అభిమానులచే సోషల్మీడియా వేదికగా ట్రోలింగ్ను ఎదుర్కొంటుంది.

సీజన్కు ముందు మెజార్టీ శాతం ఫ్రాంచైజీలను భారత ఇన్వెస్టర్లు చేజిక్కించుకోవడంతో వేలంలో పాకిస్తాన్ఆటగాడికి అవకాశం దక్కలేదు. ఫ్రాంచైజీలు పరోక్షంగా పాక్ఆటగాళ్లను బ్యాన్చేశాయి. అయితే మధ్యలో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ పాక్ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడంతో భారతీయులు మండిపడుతున్నారు.

పహల్లాం దాడి తర్వాత పాక్తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్అన్ని క్రీడా విభాగాల్లో దాయాదిని బ్యాన్చేసింది. ఇటీవల ఇంగ్లండ్లో జరిగిన వరల్డ్ఛాంపియన్షిప్ఆఫ్లెజెండ్స్టోర్నీలోనూ గ్రూప్దశ, సెమీస్లో మ్యాచ్లను బాయ్కాట్చేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో కావ్యా మారన్జట్టు పాక్ఆటగాళ్లను అక్కున చేర్చుకోవడం భారతీయులకు అస్సలు నచ్చడం లేదు. భారతీయ పెట్టుబడి దారులు లేదా ఐపీఎల్ఓనర్లు కొనుగోలు చేసిన వేర్వేరు లీగ్ల్లోని ఫ్రాంచైజీలోకూడా పాక్ఆటగాళ్లకు ప్రవేశం లేదు. ఐపీఎల్ఓనర్లు కొనుగోలు చేసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ఫ్రాంచైజీల్లో అయితే పాక్ఆటగాళ్ల ఊసే లేదు.

కావ్యా మారన్పాక్ఆటగాళ్లను జట్టులో చేర్చుకొని పెద్ద తప్పే చేసిందని భారతీయులు అంటున్నారు. సీజన్లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌కు ఇంగ్లండ్ఆటగాడు హ్యారీ బ్రూక్నాయకత్వం వహిస్తున్నాడు. జట్టులో డేవిడ్మిల్లర్‌, డేవిడ్మలాన్లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. సీజన్లో నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఆగస్ట్‌ 7 తమ తొలి మ్యాచ్ఆడనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement