IPL 2021: స్విమ్మింగ్ఫూల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల జల్సా..
DC Players Have Fun Pool Session.. ఐపీఎల్ 2021లో కేకేఆర్తో క్వాలిఫయర్ 2 మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు సరదాగా గడిపారు. కెప్టెన్ రిషబ్ పంత్, శిఖర్ ధవన్, అక్షర్ పటేల్, మరికొంతమంది డీసీ ఆటగాళ్లు స్విమ్మింగ్ఫూల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా.. ప్రస్తుతం వీడియో ట్రెండింగ్గా మారింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్లో లీగ్ దశలో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్ టాపర్గా నిలిచింది. అయితే క్వాలిఫయర్ 1లో సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైంది. అయితే క్వాలిఫయర్ 2 ద్వారా ఫైనల్ చేరే అవకాశం ఉండడంతో కేకేఆర్తో మ్యాచ్ను సీరియస్గా తీసుకోనుంది.
చదవండి: Gautam Gambhir: 'మిస్టరీ' అంటారు.. మరి ఇన్నేళ్లుగా ఎలా ఆడుతున్నాడు
Virat Kohli Crying: కన్నీరు పెట్టుకున్న కోహ్లి.. ఆ వెంటే డివిలియర్స్ కూడా
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు