రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్‌ టీమిండియాదే | India beat Zimbabwe by 90 runs in 2nd T20I | Sakshi
Sakshi News home page

IND vs ZIM: రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్‌ టీమిండియాదే

Jul 25 2026 7:59 PM | Updated on Jul 25 2026 8:17 PM

India beat Zimbabwe by 90 runs in 2nd T20I

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 

భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్‌ కిషన్‌(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్‌ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్‌బానీ, నగరవా, బెన్నెట్‌, న్యూమన్ న్యాముహురి తలా వికెట్‌ సాధించారు.

అదరగొట్టిన అభిషేక్‌
అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అభిషేక్‌ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్‌ యాదవ్‌, యశ్‌ ఠాకూర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్‌, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది. 

జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్‌(32) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్‌ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్‌కు ముందు ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్‌ కోల్పోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement