12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసిందిశ్రేయస్ అయ్యర్ (39), తిలక్ వర్మ (11) క్రీజులో ఉన్నారు. అంతకముందు అభిషేక్ శర్మ (59) ఎల్బీగా వెనుదిరిగాడు.
20 బంతుల్లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిఫ్టీ సాధించాడు. 8 ఓవర్లలో టీమిండియా 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
దంచుతున్న అభిషేక్ శర్మ
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. అభిషేక్ 16 బంతుల్లో 44 పరుగులతో ఆడుతుండగా, కెప్టెన్ అయ్యర్ ఆరు పరుగులతో సహకరిస్తున్నాడు.
చెస్టర్-లె-స్ట్రీట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20లో ఇంగ్లండ్-భారత్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి నిరాశే ఎదురైంది.
తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ మ్యాచ్లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. రవి బిష్ణోయ్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కింది.
తుది జట్లు
ఇంగ్లండ్ : ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్
భారత్: సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి


