సహజ సంచలనం | Haja Yamalapalli advances to quarterfinals | Sakshi
Sakshi News home page

సహజ సంచలనం

Jan 3 2025 3:41 AM | Updated on Jan 3 2025 3:41 AM

Haja Yamalapalli advances to quarterfinals

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ75 టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణి సహజ యామలపల్లి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌లాండ్‌లోని నొంతాబురి పట్టణంలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సహజ 5–7, 6–0, 6–2తో మూడో సీడ్‌ హీన్‌ షి (చైనా)పై సంచలన విజయం సాధించింది. 

2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఎనిమిదిసార్లు బ్రేక్‌ చేసి, తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో సహజ 6–3, 6–4తో కమోన్‌వన్‌ యోద్‌పెచ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement