భారత్‌కు రెండో ఓటమి | India suffers second defeat in Billie Jean King Cup | Sakshi
Sakshi News home page

భారత్‌కు రెండో ఓటమి

Apr 10 2026 4:03 AM | Updated on Apr 10 2026 4:03 AM

India suffers second defeat in Billie Jean King Cup

న్యూఢిల్లీ: బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు రెండో పరాజయం ఎదురైంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 0–3తో ఓడింది. తొలి మ్యాచ్‌లో వైష్ణవి అడ్కర్‌ 7–6 (7/3), 6–7 (3/7), 3–6తో ప్రిస్కా నుగ్రోహో చేతిలో... రెండో మ్యాచ్‌లో సహజ యామలపల్లి 2–6, 1–6తో జనైస్‌ టిజెన్‌ చేతిలో... మూడో మ్యాచ్‌లో అంకిత రైనా–రుతుజా 3–6, 6–7 (4/7)తో అల్దిలా సుత్జియాది–జనైస్‌ టిజెన్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. నేడు జరిగే నాలుగో మ్యాచ్‌లో మంగోలియాతో భారత్‌ ఆడుతుంది. ఆరు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీలో కొరియా, ఇండోనేసియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement