
ఠాకూర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీశ్కుమార్ రెడ్డి స్ధానంలో తుది జట్టులోకి వచ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసిన ఠాకూర్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే తీరును కనబరిచాడు.
జోష్ టంగ్ బౌలింగ్లో చెత్త షాట్ ఆడి తన వికెట్ను సమర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెటర్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.
దీంతో భారత కెప్టెన్ శుబ్మన్ గిల్ మరో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశమివ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో శార్థూల్ ఠాకూర్పై టీమిండియా మెనెజ్మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డర్లో శార్ధూల్ తన అనుభవంతో పరుగులు సాధిస్తాడని భావించింది. అందుకే ఆసీస్ గడ్డపై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్ను ఆడించారు.
కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ నమ్మకాన్ని శార్ధూల్ వమ్ము చేశాడు. ఈ క్రమంలో టీమ్మెనెజ్మెంట్పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నాడు. శార్థూల్ను ఎందుకు అవకాశమిచ్చారు.. అతడి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని పోస్ట్లు పెడుతున్నారు.
మరోవైపు శార్దూల్కు తొలి ఇన్నింగ్స్లో కేవలం 6 ఓవర్ల మాత్రమే బౌలింగ్ ఇవ్వడాన్ని పలువురు మాజీలు తప్పబడుతున్నారు. అతడిపై మీకు నమ్మకం లేనప్పుడు జట్టులోకి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇక లీడ్స్ టెస్టు ముగింపునకు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇంగ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 పరుగులు కావాలి.
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి