టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ దూరం..! | England Spinner Adil Rashid misses Out on White ball Series Against India | Sakshi
Sakshi News home page

ENG vs IND: టీమిండియాతో టీ20, వన్డే సిరీస్‌.. ఇంగ్లండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ దూరం..!

Jun 24 2022 9:12 AM | Updated on Jun 24 2022 10:16 AM

England Spinner Adil Rashid misses Out on White ball Series Against India  - Sakshi

టీమిండియాతో స్వదేశంలో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు ఇంగ్లండ్‌ స్టార్‌ స్పిన్నర్‌ ఆదిల్ రషీద్ దూరమయ్యాడు. ఆదిల్ రషీద్ హజ్ యాత్ర నిమిత్తం ఈ సిరీస్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 బ్లాస్ట్‌లో యార్క్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్.. ఇదే కారణంతో టోర్నీ అఖరి మ్యాచ్‌లకు కూడా దూరం కానున్నాడు.

ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టులో రషీద్ భాగం‍గా ఉన్నాడు. అయితే తాను చాలా కాలం నుంచి  తీర్థయాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నట్లు రషీద్ తెలిపాడు. జూన్‌ 25న మిడిల్ ఈస్ట్‌కు వెళ్లేందుకు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు,యార్క్‌షైర్‌లు తనకు సెలవు మంజూరు చేసినట్లు రషీద్‌ చెప్పాడు.

"నేను చాలా రోజుల నుంచి హజ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటున్నాను. బీజీబీజీ షెడ్యూల్‌ వల్ల సమయం దొరకలేదు. నేను ఈ విషయం గురించి ఈసీబీ, యార్క్‌షైర్‌తో మాట్లాడాను. వారు అర్ధం చేసుకుని నాకు అనుమతి ఇచ్చారు" అని రషీద్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జూలై 7న సౌతాంప్టన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో వైట్‌బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది.
చదవండి: ENG vs NZ: దురదృష్టమం‍టే నికోల్స్‌దే.. ఇలా కూడా ఔట్‌ అవ్వొచ్చా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement