
ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయి సుదర్శన్ దుమ్ములేపుతున్నాడు. ప్రతీ మ్యాచ్లోనూ పరుగులు సాధించి గుజరాత్ జైత్ర యాత్రలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సోమవారం కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లోనూ సుదర్శన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు.
ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడిన సుదర్శన్.. 50 కంటే ఎక్కువ సగటుతో 417 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సుదర్శన్పై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. టీ 20 క్రికెట్ను ట్రేడిషనల్గా ఎలా ఆడాలో సుదర్శన్ చూపిస్తున్నాడని అతడు కొనియాడాడు.
"సాయిసుదర్శన్ అద్బుతంగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదు. చాలా సంతోషంగా ఉంది. అతడు క్లాసికల్ బ్యాటర్గా ఆడుతున్నాడు. క్రికెట్ను సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఆడవచ్చో తన బ్యాటింగ్తో చూపిస్తున్నాడు. సుదర్శన్ బంతి వేగాన్ని సరిగ్గా ఉపయోగించుకుని స్మార్ట్ క్రికెట్ ఆడుతున్నాడు.
ప్రతీ మ్యాచ్లో పరుగులు సాధించడం అతడి ఆత్మవిశ్వాస్వాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. సుదర్శన్ అద్భుత ఫామ్ జట్టు మొత్తాన్ని ప్రభావితం చేస్తోంది. అందరు ఆటగాళ్లు ఒకే లయలో ఆడతారు. ప్రస్తుతం గుజరాత్ టీమ్లో అదే మనం చూస్తున్నాము" అని జియో స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: టీమిండియా క్రికెటర్ మంచి మనసు.. రూ.7 లక్షల ఆర్ధిక సాయం