హుస్నాబాద్రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఖాళీల భర్తీకి పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 12 లెక్చరర్ పోస్టులు మంజూరయ్యాయని, వీటి కోసం అర్హుల నుంచి ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్–4, కంప్యూటర్ ఇంజనీరింగ్–2, ఈఈఈ–3తోపాటు, గణితం–1, భౌతికశాస్త్రం–1, రసాయనశాస్త్రం–1 పోస్టులున్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 22 వరకు హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న సర్టిఫికెట్లు పరిశీలించి ఉదయం 10 గంటలకు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ పి.శ్రీదేవి


