వీర హనుమాన్‌ యాత్ర విజయవంతం చేయాలి

వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు - Sakshi

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 6న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వీర హనుమాన్‌ విజయయాత్రను విజయవంతం చేయాలని మెదక్‌ విభాగ్‌ విశ్వహిందూ పరిషత్‌ సహ కార్యదర్శి గ్యాదరి రాజారాం కోరారు. ఆదివారం హనుమాన్‌ ఆలయం ఆవరణలో యాత్రకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతం ఆయన మాట్లాడుతూ యాత్రలో యువత పాల్గొని హిందూ సంఘటిత శక్తిని తెలిపాలన్నారు. కార్యక్రమంలో బజరంగ్‌ దళ్‌ జిల్లా అధ్యక్షుడు ఎక్కల దేవి శ్రీనివాస్‌, జిల్లా సహా సంయోజక్‌ బైరి మురళి, విశ్వహిందూ పరిషత్‌ జిల్లా సహకార్యదర్శి బస్సా నరేష్‌, విశ్వహిందూ పరిషత్‌ మఠా మందిర్‌ ప్రముఖ్‌ బచ్చు నాగేందర్‌, తోర్నాల గ్రామ విశ్వహిందూ పరిషత్‌ అధ్యక్షుడు గడ్డం రాజు, కార్యకర్తలు బోనాల శ్రీనివాస్‌, భగవాన్‌, బోనాల నాగరాజు, శ్రీకాంత్‌ రెడ్డి, శేఖర్‌, చందు, శ్రీనివాస్‌, సునీల్‌, అజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ విభాగ్‌ విశ్వహిందూ పరిషత్‌

సహ కార్యదర్శి గ్యాదరి రాజారాం

Read latest Siddipet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top