శివంపేట (నర్సాపూర్): మండల పరిధిలోని ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామైన గోమారంలో బోనాల ఉత్సవాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామాల్లో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఇరు పార్టీలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో గొడవ ప్రారంభమై ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకుంటూ దాడులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గొడవలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అదుపులోకి రాలేదు. ఎస్సై మధుకర్రెడ్డి ఆధ్వర్యంలో అదనపు పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి
నారాయణఖేడ్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని తపస్ జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి పేర్కొన్నారు. ఖేడ్లో ఆదివారం నిర్వహించిన సంఘం డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీ సీపీఎస్ రద్దును పూర్తిగా మర్చిపోయారన్నారు. పీఆర్సీని వెంటనే ప్రకటించి డీఏ బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరారు. ప్రీ ప్రైమరీ బడుల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలన్నారు. సంఘం రాష్ట్ర సేవ కో– కన్వీనర్ చంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్, జిల్లా, డివిజన్ బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్, రతన్సింగ్, మశ్చందర్, మహేశ్, పద్మనాభం, రాజు, జగదీశ్వర్ పాల్గొన్నారు.


