పేట అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. బుధవారం పెద్దశంకరంపేటలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉపసర్పంచ్ రాజుగౌడ్తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. కార్యక్రమంలో నా యకులు మురళిపంతులు, నారాగౌడ్, సంగమేశ్వర్, బాసాడ రాజు, సుభాశ్గౌడ్, సర్పంచ్లు పెరుమాండ్లుగౌడ్, కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.


