
ఆలయంలో చిన్నజీయర్ స్వామి
రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడిచి అధికారంలోకి వస్తే.. దుబ్బాక నియోజక వర్గంలో మాత్రం పార్టీ ఘోరపరాజయంచవిచూసింది.
వివరాలు 8లో u
వైభవంగా వైకుంఠపురం
తృతీయ వార్షికోత్సవాలు
సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం తృతీయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం చిన్నజీయర్ స్వామి ఆలయాన్ని సందర్శించారు. వివిధ రాష్టాల వైష్ణవ ఆలయాల పండితులకు, భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు. జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కేతకీలో పూజలు
ఝరాసంగం(జహీరాబాద్): కార్తీక మాసం సందర్భంగా కేతకీ సంగమేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఆదివారం తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి వారు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఆవరణలో ఉన్న అమృతగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, జలలింగానికి పూజలు చేశారు.

దీపాలను వెలిగిస్తున్న భక్తులు