చేపలు తెచ్చిన తంటా.. | - | Sakshi
Sakshi News home page

చేపలు తెచ్చిన తంటా..

Jul 27 2023 8:16 AM | Updated on Jul 27 2023 2:20 PM

- - Sakshi

సంగారెడ్డి: ఒక వ్యక్తిపై ఇద్దరు కత్తి, కర్తతో మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతడి తలకు గాయమైంది. ఈ ఉదంతం తోటపల్లిలో మంగళవారం జరిగింది. చేపలు పట్టే వాగు వద్ద వీరన్నకు, సంపత్‌కు గొడవైంది. ఈ గొడవలో సంపత్‌కు గాయాలయ్యాయి. అనంతరం ఆయన చికిత్సపొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత సంపత్‌ బంధువులు భాస్కర్‌, మరొక వ్యక్తితో కలిసి వీరన్నపై దాడికి వెళ్లారు.

వీరన్న, భాస్కర్‌ మధ్య గొడవ జరుగుతోంది. ఈ గొడవ విషయం వీరన్న కుటుంబసభ్యులతో అతడి వెంట ఉన్న వ్యక్తి చెప్పారు. వీరన్న తండ్రి మల్లేశం, సోదరుడు రమేశ్‌ కత్తి, కర్త తీసుకొని గొడవ పడుతున్న స్థలానికి చేరుకొని భాస్కర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో భాస్కర్‌కు తల పగిలింది. దీనిపై స్థానికులు పోలీసులకు, భాస్కర్‌ కుటుంబీకులు సమాచారం అందించారు. భాస్కర్‌ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ పీ మహేశ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement