ఏటా జూలై 26న కార్గిల్ దివస్ నిర్వహిస్తాం. దేశరక్షణలో ప్రాణాలొడ్డిన వీరసైనికులకు నివాళి అర్పిస్తాం. నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా 2002లో అప్పటి కేంద్ర మంత్రి విద్యాసాగర్రావు చొరవతో వైజయంతి యుద్ధట్యాంక్ను ఢిల్లీ నుంచి తెప్పించారు. మున్సిపల్ నిధులతో కార్గిల్లేక్పై వేదికను ఏర్పాటు చేశాం. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఇటీవల నిధులు కేటాయించారు. సుందరీకరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల పట్ట ణానికి కార్గిల్ లేక్ ఐకాన్గా నిలుస్తోంది.
– ఆడెపు రవీందర్, మున్సిపల్ మాజీ చైర్మన్


