బాబు వచ్చె.. రైతన్నకు తిప్పలు తెచ్చె: వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ | Ysrcp Posts Video On Ap Farmers Plight Under Alliance Government Ruling | Sakshi
Sakshi News home page

బాబు వచ్చె.. రైతన్నకు తిప్పలు తెచ్చె: వైఎస్సార్‌సీపీ ట్వీట్‌

Aug 7 2024 1:45 PM | Updated on Aug 7 2024 2:59 PM

Ysrcp Posts Video On Ap Farmers Plight Under Alliance Government Ruling

సాక్షి,తాడేపల్లి: ఏపీలో అన్నదాతలు ఐదేళ్ల తర్వాత మళ్లీ రోడ్డెక్కారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతన్నలకు కష్టాలు మొదలయ్యాయని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది. ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో రైతన్నల ప్రస్తుత పరిస్థితిపై బుధవారం(ఆగస్టు7)  ఒక వీడియో పోస్టు చేసింది.

నరసరావుపేటలో ఓ పక్క జోరు వాన పడుతుంటే వరి విత్తనాల టోకెన్ల కోసం రైతన్నలు బారులు తీరిన వైనాన్ని వీడియోలో కళ్లకుకట్టింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు రైతు భరోసా కేంద్రాల సహాయ సహకారంతో ఐదేళ్లు రైతన్నలు దర్జాగా వ్యవసాయం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. బాబు పాలన వచ్చింది.. తిప్పలు తెచ్చిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement