
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీలో ఈ మధ్య కీలక బాధ్యతల అప్పగింత జరుగుతోంది. తాజాగా.. సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించారు అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ఈ బాధ్యతలతో పాటు అదనంగా నాలుగు నియోజకవర్గాలను భర్తీ చేస్తూ తిరుపతి జిల్లా వైస్సార్సీపీ అధ్యక్ష బాధ్యతలను కూడా పెద్దిరెడ్డికి అప్పగించారు. మరోవైపు.. పార్టీ తరఫున రాష్ట్ర అధికార ప్రతినిధులుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకరరావు, ఆర్కే రోజా, ఆరె శ్యామలను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
