సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీపై పోలీసుల ఆంక్షలు విధించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ 21న వైఎస్సార్సీపీ ర్యాలీ నిర్వహించతలపెట్టింది. నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్కు మాచవరం పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఎలాంటి ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. ర్యాలీలు చేపడితే చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విశాఖలో నీటి కొరత ఉందని ఒప్పుకున్న చంద్రబాబు


