విశాఖలో నీటి కొరత ఉందని సీఎం చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఏడాదికి నీటి కొరత లేకుండా చేస్తామని ప్రకటించారు. ఈ ఏడాది తప్ప, వచ్చే ఏడాది నుంచి నీరు సరఫరా చేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చారు.
విశాఖలో మంచి నీటి సమస్యతో గత కొంత కాలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విశాఖలో నీటి సమస్య లేదని చెబుతున్న కూటమి ఎమ్మెల్యేలు చెబుతున్న విషయం తెలిసిందే. సీఎం వ్యాఖ్యలతో విశాఖ నగరంలో నీటి సమస్య ఉందని వాస్తవం బయటపడింది.


