‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అంటే ఏంటో చెప్పండి

Telangana: YSRTP Chief YS Sharmila Question To BRS Party - Sakshi

బీఆర్‌ఎస్‌కు వైఎస్‌ షర్మిల సూటి ప్రశ్న    

సాక్షి, హైదరాబాద్‌: ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అంటే ఏంటో జర చెప్పాలని బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను వైఎస్సార్‌టీపీ అధ్య క్షురాలు వైఎస్‌ షర్మిల సూటిగా ప్రశ్నించారు. సోమవారం ట్విట్టర్‌ వేదికగా రైతుల పట్ల కేసీఆర్‌ అనుసరిస్తున్న వైఖరిని ఆమె ఆక్షేపించారు.

దేశంలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో అగ్రస్థా నంలో పెట్టడం రైతుకు భరో సానా అని నిలదీ శారు. రాష్ట్రంలో ఒక్కో రైతు నెత్తి మీద లక్షన్నర అప్పు పెట్టడం అభివృద్ధా? 37 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టడం బీఆర్‌ఎస్‌ నినాదమా అని షర్మిల ఎద్దేవా చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top