సీఎల్పీ భేటీకి బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు | Telangana Congress Legislative Party Meeting Updates | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన సీఎల్పీ భేటీ..హాజరైన బీఆర్‌ఎస్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలు

Sep 22 2024 3:58 PM | Updated on Sep 22 2024 5:49 PM

Telangana Congress Legislative Party Meeting Updates

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 సీఎల్పీ సమావేశం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్‌లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్‌కు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. 

ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర

Advertisement
 
Advertisement
Advertisement