రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం | Raghunandan Rao Satirical Comments On BRS | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పనైపోయింది.. అందుకు ఇదే నిదర్శనం

Jan 28 2025 4:02 PM | Updated on Jan 28 2025 4:51 PM

Raghunandan Rao Satirical Comments On BRS

సాక్షి,హైదరాబాద్‌ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది. అందుకు ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం అని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు బీఆర్‌ఎస్‌పై సెటైర్లు వేశారు.

తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రఘునందన్‌ రావు మాట్లాడుతూ..ఎన్నికల్లో పోటీచేసేందుకు బీఆర్‌ఎస్‌ ముఖం చాటేసింది. కేసీఆర్‌  సొంత జిల్లాలో ఎమ్మెల్సీకి అభ్యర్థులు లేరా?. ఎమ్మెల్సీ విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. యువరాజు సమాధానం చెప్పాలి.

టీచర్స్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకపోవడం దారుణం. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వరు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు సీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పని అయిపొయింది అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనం. బీఆర్‌ఎస్‌ తొకముడువడంతో బీజేపీ విజయం నల్లేరుమీద నడకయ్యిందని రఘునందన్‌ రావు వ్యాఖ్యానించారు. 

మరోవైపు, ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి సరోత్తమ్‌రెడ్డి (వరంగల్‌),  కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్య(పెద్దపల్లి), కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌  పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డి(సంగారెడ్డి)ని ఎంపిక చేసినట్టు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement