బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల పక్షపాతి సీఎం జగన్‌: మంత్రి పెద్దిరెడ్డి | Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల పక్షపాతి సీఎం జగన్‌: మంత్రి పెద్దిరెడ్డి

Feb 22 2023 1:47 PM | Updated on Feb 22 2023 3:00 PM

Minister Peddireddy Ramachandra Reddy Comments On Chandrababu - Sakshi

 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

సాక్షి, అనంతపురం జిల్లా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ నుంచి పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి వెన్నపూస రవీంద్రారెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంవీ రామచంద్రారెడ్డి, అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి మంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు.

అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోనే తొలిసారిగా వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని మంత్రి అన్నారు. బీసీలను ఓటు బ్యాంకులా చూసి అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
చదవండి: ఇకపై ‘లా నేస్తం’ పథకం ఏడాదికి రెండుసార్లు: సీఎం జగన్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement