Jogi Ramesh Comments On Eenadu Ramoji Rao Over Fake News On AP Houses Construction - Sakshi
Sakshi News home page

‘ఈనాడు’కు ఎందుకంత కడుపుమంట?.. రామోజీకి కళ్లు కనపడట్లేదా?’

Nov 9 2022 5:48 PM | Updated on Nov 9 2022 6:55 PM

Minister Jogi Ramesh Comments On Eenadu Ramoji Rao - Sakshi

అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంత మంచి జరుగుతుంటే రామోజీకి కళ్లు కనపడట్లేదా? అని దుయ్యబట్టారు.

ఇళ్ల నిర్మాణంపై ఈనాడులో ఏనాడైనా వార్త రాశావా? అంటూ నిప్పులు చెరిగారు. ఇళ్ల నిర్మాణంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. రామోజీ పత్రిక ప్రతిరోజూ ఏడుపుతోనే ప్రింట్‌ అవుతుంది. 2014-19 వరకు చంద్రబాబు ఒక్క ఇల్లు కట్టించారా?. చంద్రబాబు పేదలకు ఇళ్లు కట్టకపోయినా రామోజీరావుకి కమ్మగా ఉంటుంది. దుష్టచతుష్టయం వస్తే నేనే స్వయంగా ఇళ్ల నిర్మాణాలు చూపిస్తా. మేం 31 లక్షల ఇళ్లు నిర్మిస్తుంటే రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు.
చదవండి: ‘డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement