వైఎస్‌ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే | Mantralayam MLA Balanagireddy Gives Clarity On Party Change Rumours, More Details Inside | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌తోనే నా ప్రయాణం: మంత్రాలయం ఎమ్మెల్యే క్లారిటీ

Feb 11 2025 3:19 PM | Updated on Feb 11 2025 4:50 PM

Mantralayam Mla Balanagireddy Clarity On Party Changing

సాక్షి,కర్నూలుజిల్లా: తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నిజం కాదని మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.  

తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల వల్ల పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉన్నానని,అంతేకానీ పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, మండల నాయకుల ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని బాలనాగిరెడ్డి తెలిపారు.

వైఎస్ఆర్ సీపీ హయాంలో మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి నాకు లేదు:  Balanagi Reddy


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement