ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్‌ రెడ్డి | Kishan Reddy comments houses demolish in Hyderabad over Musi river project | Sakshi
Sakshi News home page

ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్‌ రెడ్డి

Nov 7 2024 5:28 PM | Updated on Nov 7 2024 5:33 PM

Kishan Reddy comments houses demolish in Hyderabad over Musi river project

హైదరాబాద్‌, సాక్షి: హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్‌  ఎస్టేట్‌ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. 

‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్‌ వాల్‌ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement