
జనసేనకు మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు.
సాక్షి, కాకినాడ: జనసేనకు మాజీ మేయర్ పోలసపల్లి సరోజ రాజీనామా చేశారు. పార్టీలో అందరి డబ్బు వాడుకున్న పంతం నానాజీకి సీటు ఇచ్చారంటూ ఆమె మండిపడ్డారు. ‘‘జనసేన అనేది రెసిడెన్షియల్ కాలేజీ లాంటిందని.. ఒక కార్పోరేట్ ఆఫీస్లా నడుపుతున్నారంటూ ధ్వజమెత్తారు.
‘‘జనసేనలో మహిళలకు విలువ లేదు. నాదెండ్ల మనోహర్ టీడీపీకి కోవర్ట్. నాదెండ్ల మనోహర్, హరిప్రసాద్, చక్రవర్తి వంటి నేతలతో మేము చాలా ఇబ్బందిపడ్డాం. బీసీలకు కూడా జనసేనలో విలువ లేదు. జనసేనలో బీసీలు ఇప్పటికైనా మేల్కోవాలని సరోజ అన్నారు.
ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..!