ఆ ఆరుగురు మంత్రుల్లో టెన్షన్​ టెన్షన్​ | UP Election 2022 Phase 1: 58 Seats Jat Dominated Area Play Key Role | Sakshi
Sakshi News home page

రైతు ఉద్యమ హబ్​లో పోలింగ్​: ఆరుగురు మంత్రులకు తప్పని టెన్షన్​.. ‘జాట్’​ కరుణించేనా? ప్రతికూల అంశాలు ఏంటంటే..

Feb 10 2022 8:33 AM | Updated on Feb 10 2022 8:40 AM

UP Election 2022 Phase 1: 58 Seats Jat Dominated Area Play Key Role - Sakshi

ముజఫర్​ అల్లర్ల నుంచి రైతుల ఉద్యమం దాకా.. చివరికి చెరకు రైతులకు హామీ విషయంలో బీజేపీ తీరుపై..

UP Assembly Elections 2022: 2013 ముజఫర్‌నగర్ హింసాత్మక ఘటనలతో జాట్‌లు, మైనార్టీల మధ్య చీలిక ఏర్పడి..  2017 ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. మెజార్టీ సీట్లతో బంపర్​ విక్టరీ సాధించింది. కానీ,  ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

తొలి దశలో పశ్చిమ యూపీలో ప్రధానంగా వార్తల్లో ఉన్న నియోజకవర్గాలైన కైరానా, థాన్‌భవన్, సర్దానా, ఆగ్రా రూరల్, మథుర, నొయిడా, హస్తినాపూర్‌‌ పోలింగ్​ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో యోగి క్యాబినెట్‌లోని మంత్రులు బరిలో ఉన్నారు. మంత్రులు శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్​, చౌధురి లక్ష్మీ నారాయణ్‌లు ఈ దశలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే వీళ్లలో ఇప్పుడు టెన్షన్​ టెన్షన్​ నెలకొంది.

ఓటమి ఆందోళనకు కారణాలు..
పశ్చిమ యూపీ రీజియన్​​.. చెరుకు పంటకు ఫేమస్​. అయితే ఈ ప్రాంతంలోని రైతులకు రూ.1.5 లక్షల కోట్లు చెల్లించామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకొంటోంది. కానీ, ఈ విషయంలో రైతులు మాత్రం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  

జాట్‌ ఓటర్లు.. తొలి దశ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఈ సామాజిక వర్గమే ముందుండి నడిపించింది. 

జాట్‌లలో పట్టున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్డీ)తో పొత్తు సమాజ్‌వాదీ పార్టీ పొత్తు పెట్టుకోవడం మరో కీలక పరిణామం. 

గత ఎన్నికల్లో 58 సీట్లకుగానూ బీజేపీ 53 సీట్లను గెలుచుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన ఆర్ఎల్డీ.. ఈసారి ఎస్పీ వెంటనడుస్తోంది.

కరోనా సమయంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ తీరుపైనా నిరసనలు వెల్లువెత్తాయి.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో పశ్చిమ యూపీ కీలక పాత్ర పోషించింది. దీంతో బీజేపీపై ఇది కొంత ప్రతికూలాంశంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌కు ముఖద్వారమైన ఢిల్లీ సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో షామ్లీ, ముజఫర్‌నగర్‌, బాగ్‌పత్‌, మేరఠ్‌, గాజియాబాద్‌, హాపుఢ్‌, గౌతమబుద్ధనగర్‌, బులంద్‌షెహర్​, అలీగఢ్‌, మథుర, ఆగ్రా జిల్లాలు ఉన్నాయి.

ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. కోవిడ్-19 నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి దశలో పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 623 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సంబంధిత వార్త: నామినేషన్​లో రెండో భార్య పేరు.. మొదటి భార్య అలక, ఆపై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement