కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు | Brs Leader Harish Rao Comments On Cm Revanth Minister komatireddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు

Nov 9 2024 1:46 PM | Updated on Nov 9 2024 3:07 PM

Brs Leader Harish Rao Comments On Cm Revanth Minister komatireddy

సాక్షి,మెదక్‌జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్‌ 9) నర్సాపూర్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.

రాష్ట్రంలో పాలనను  గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్‌లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్‌,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటీ కంపు ఎక్కువ.‍ కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్‌రావు అన్నారు. 

కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేశారు: సీఎం రేవంత్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement