పెరిగిన బలం.. బీజేపీలో చేరిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు | Boost For BJP 2 Independent MLAs Join Party After Haryana Results | Sakshi
Sakshi News home page

పెరిగిన బలం.. ఆ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ వైపే..

Oct 9 2024 3:33 PM | Updated on Oct 9 2024 4:04 PM

Boost For BJP 2 Independent MLAs Join Party After Haryana Results

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను పటాపంచలు చేస్తూ.. తిరుగులేని పార్టీగా అవతరించింది. 90 స్థానాల్లో 48 చోట్ల గెలుపొంది ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

తాజాగా అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు దేవేందర్‌ కద్యన్‌, రాజేష్‌ జూన్‌.. కేంద్రమంత్రి, హర్యానా ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్‌ నివాసంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ మోహన్‌లాల్‌ బడోలీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగిన కద్యన్‌ గనౌర్‌ నుంచి గెలుపొందగా.. రాజేష్‌ జూన్‌ బహదూర్‌ఘర్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించి విజయం సాధించారు. 

అయితే మరో ఎమ్మెల్యే సావిత్రి జిందాల్‌ గత మార్చిలో లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే టికెట్‌ రాకపోవడంతో హిసార్‌ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆమె కూడా బీజేపీకి తన మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.  వీరి చేరికతో  పదేళ్ల పాలన తర్వాత  గెలుపు అసాధ్యమనుకున్న చోట ఘన విజయం సాధించిన బీజేపీకి మరింత బలం చేకూరింది. దీంతో అసెంబ్లీలో బీజేపీ బలం 52కి చేరనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement