మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు  | BJP Leader Kishan Reddy About Narendra Modi As PM Third Time | Sakshi
Sakshi News home page

మోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరు 

Jan 10 2024 5:31 AM | Updated on Jan 10 2024 5:31 AM

BJP Leader Kishan Reddy About Narendra Modi As PM Third Time - Sakshi

వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: లక్షమంది అసదుద్దీన్‌లు, లక్ష మంది కేసీఆర్‌లు, లక్ష మంది రాహుల్‌గాంధీలు వచ్చినా నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని కావడాన్ని అడ్డుకోలేరని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించిన ఫలితాలు రాబోతున్నాయని, వచ్చే ఐదేళ్లలో దేశంలో ఎవరూ ఊహించని మార్పులు జరగబోతున్నాయని చెప్పారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్‌ వికసిత్‌ భారత్‌ అంబాసిడర్‌ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు.

2047లోపు భారత్‌ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం కాదు.. దేశాభివృద్ధి కోసం వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి పౌరుడు వికసిత్‌ భారత్‌ అంబాసిడర్‌గా మారాలని, నేను సైతం  అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఎల్‌కే అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని 1990లో బీజేపీ (పాలమూరులో) తీర్మానం చేసిందని, అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని అన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement