ఇలాంటి పని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు: ఆర్‌ కృష్ణయ్య | BC Leader, MP R Krishnaiah Great Words About CM Jagan | Sakshi
Sakshi News home page

ఇలాంటి పని దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు: ఆర్‌ కృష్ణయ్య

Jun 29 2022 3:49 PM | Updated on Jun 29 2022 9:04 PM

BC Leader, MP R Krishnaiah Great Words About CM Jagan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ కులాలకు శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌కు బీసీ కులాలకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నా.. బీసీలకు ఇంత ప్రాధాన్యం ఇవ్వరు. 56 కార్పొరేషన్‌ల ద్వారా బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. దేశంలో చదువుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మరొకరు లేరు. అమ్మఒడి, జగనన్న వసతి దీవెన ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు భవిష్యత్ ఇస్తున్నారు. బీసీలంతా వైఎస్సార్‌సీపీకి అండగా ఉండాలి. వైఎస్సార్‌సీపీ ప్లీనరిని విజయవంతం చేస్తాం' అని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య అన్నారు.

చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు)

Advertisement
 
Advertisement
Advertisement