
AP Elections Political Latest Updates Telugu
6.30 PM, Feb 4, 2024
పవన్ కల్యాణ్ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే: మంత్రి అంబటి రాంబాబు
- చంద్రబాబు అద్దె ఇంట్లో భేటీ అయిన పవన్ కల్యాణ్- చంద్రబాబు
- పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియదు
- చంద్రబాబు కుప్పంలో పోటీ చేస్తారో మరోచోట నుంచి పోటీ చేస్తారో తెలియని పరిస్థితి
- ఇప్పటికే మేము సిద్ధం, యుద్ధం కూడా అయిపోతుంది
- వైఎస్సార్సీపీ గెలిచి అధికారంలోకి వస్తుంది అప్పటిదాకా వీరు సీట్లు తేల్చుకోలేరు
- సీట్లు కన్నా ముందు నోట్లు తేల్చుకోవాలి
- నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదు
- పవన్ కల్యాణ్ను నమ్మిన వారు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే
- పవన్ కల్యాణకు ఇచ్చేది ముష్టి సీట్లు మూడో, ముప్పైయో, ఇరవైఐదో
- సీట్లు ఏమో ముష్టిస్తారు.. క్యాష్ ఏమో బలంగా ఇస్తారు
6.00 PM, Feb 4, 2024
ప్రకాశం పొన్నలూరులో టీడీపీకి షాక్
మంత్రి ఆదిమూలపు సురేష్ సమక్షంలో పది కుటుంబాలు టీడీపీ నుంచి అధికార వైఎస్సార్సీపీలో చేరిక
5:15 PM, Feb 4, 2024
ఎల్లో మీడియాపై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్
- సీఎం జగన్ వాస్తవాల ప్రసంగంపై ఎల్లో మీడియా రోత రాతలు రాసింది
- చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే, సీఎం జగన్ చెప్పేవన్నీ వాస్తవాలు
- చంద్రబాబు చెప్పే అబద్ధాలకు రామోజీరావు వత్తాసు పలుకుతున్నారు
- సీఎం జగన్ పిలుపుతో సిద్ధం సభకు లక్షలాది మంది తరలివచ్చారు
4:40 PM, Feb 4, 2024
► సత్యసాయి జిల్లా ధర్మవరం 30, 33, 34, 35, 40 వార్డుల్లో టీడీపీకి చెందిన 175 కుటుంబాలు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక
4:15 PM, Feb 4, 2024
మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్..
- వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి
- ప్రజలకు సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగలంటే మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి
- వైఎస్సార్సీపీకి వస్తున్న స్పందన చూసి ఎల్లో మీడియా ఓర్వలేకపోతోంది
- విశాఖపై ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తోంది
4:00 PM, Feb 4, 2024
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కామెంట్స్
- నిన్న జరిగిన సిద్ధం సభకు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా జనం వచ్చారు
- మేమంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు
- పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నాము
- దెందులూరులో జరిగిన సభ రాష్ట్రవ్యాప్తంగా చర్చినియాంశంగా మారింది
- భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి
- జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే మా.. స్టార్ క్యాంపెనర్లలని సీఎం సూచించారు
- వై నాట్ 175 అనేది నిన్న సభతో ప్రతిపక్షాలకు అర్థమైంది
- సీఎం జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నాం అనే నినాదం వినబడింది
- ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదాము జగనన్న కోసం అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి
- ఎన్నికల తర్వాత ప్రతిపక్షాల నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతారు
- పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారు
- కుప్పం టూ ఇచ్చాపురం అభ్యర్థులు ఎవరో చెప్పాము మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టంగా చెప్పాము
- అభ్యర్థులు కరువై.. పొత్తులకు వెళుతున్నారు ప్రతిపక్షాలు
3:30 PM, Feb 4, 2024
మైలవరం టీడీపీలో ముసలం
- టీడీపీ నేత దేవినేని ఉమాకు టిక్కెట్ టెన్షన్
- ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన దేవినేని ఉమా
- టీడీపీలోకి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దేవినేని ఉమా
- నేను మా వదినను చంపానని నాపై వసంత కృష్ణ ప్రసాద్ అపవాదు వేశారు
- 1999 ఎన్నికల్లో గెలుపు కోసం తండ్రీకొడుకులు ఇద్దరూ నాపై దుష్ప్రచారం చేశారు
- నా కుటుంబ సభ్యులను చంపానని ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు
- వసంత కృష్ణ ప్రసాద్.. సుజనా చౌదరితో కలిసి సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయి
- నాలుగున్నరేళ్లు ఇసుక వ్యాపారం చేసుకున్నాడు
- 30 ఏళ్లు కాకుల్లా పొడిచినా నేను నోరెత్తలేదు
- 30 ఏళ్ళు మానసికంగా చంపాలని, చంపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు
- మైలవరం నియోజకవర్గంలో సహజసంపద దోపిడీ చేశాడు
- కేశినేని నాని మా కార్యకర్తలు, నాయకుల గుండెలపై తన్నాడు
- కృష్ణ ప్రసాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గుండెల మీద తన్ని హైదరాబాద్లో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి వైఎస్సార్సీపీ గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు
- చంద్రబాబు మాట సుప్రీం.. ఈ నెల రెండో వారం నుంచి జనంలోకి వెళ్తాను
- కృష్ణ ప్రసాద్, లగడపాటి రాజగోపాల్ లాంటి నాయకులు దోచుకున్న డబ్బును వెదజల్లేందుకు వస్తున్నారు
- మైలవరం నియోజకవర్గంలో 100 కోట్లు వెదజల్లేందుకు వస్తున్నారు
02:01 PM, Feb 4, 2024
టీడీపీకి ఇవే లాస్ట్ ఎన్నికలు: ఎంపీ కేశినేని నాని
- చంద్రబాబు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు
- చంద్రబాబు, ఆయన పనికిమాలిన కొడుకు కలలు కంటున్నారు
- టీడీపీ పార్టీ పని అయిపోయింది
- అమరావతి కడతానన్న చంద్రబాబు ఏపీలో సొంతిల్లు కూడా కట్టుకోలేదు
- ఇక్కడ సీట్లను అమ్ముకుని వచ్చిన డబ్బుతో చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ పోతారు
- 2024 ఎన్నికలవ్వగానే మేలో ఫలితాలొస్తాయి
- రిజల్స్ట్ రాగానే చంద్రబాబు, లోకేష్ వాళ్ల సొంత రాష్ట్రం తెలంగాణ పోవడం ఖాయం
- టీడీపీ పార్టీ ఈనాడు,ఆంధ్రజ్యోతి, టివి5, సోషల్ మీడియా మీదే ఆధారపడింది
- టీడీపీ పార్టీకి గ్రౌండ్ లెవల్లో పనిచేసే వారియర్స్ ఎవరూ లేరు
- నా చిన్నప్పుడు ఎన్టీఆర్ సభల్లో చూసినంత జనం సిద్ధం సభలో చూశా
- గుడివాడలో చంద్రబాబు సభ పెడితే 3 వేల మంది కూడా రాలేదు
- చంద్రబాబు మాట్లాడేసరికి ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోయారు
- చంద్రబాబు మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు
- సీఎం జగన్ పేదల కోసం పనిచేసే వ్యక్తి
- ధనికుల కోసం.. పనికిమాలిన కొడుకు కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు
- రాబోయే ఎన్నికల్లో మనం నొక్కే బటన్ దెబ్బకు ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవాలి
- కేసీఆర్ కేసుపెడతాడని అర్ధరాత్రి తెలంగాణ నుంచి ఏపీకి చంద్రబాబు పారిపోయి వచ్చాడు
- ఇప్పుడు జగనన్న దెబ్బకు ఏపీ నుంచి తెలంగాణ పారిపోవడం ఖాయం
01:53 PM, Feb 4, 2024
ఈనాడు పిచ్చి రాతలు: డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
- చంద్రబాబు చెప్పే అబద్దాలకు వత్తాసు పలికేందుకు రామోజీ రావుకు సిగ్గుండాలి
- కనకదుర్గమ్మ ఆలయంలో సిఫార్సుతో సంబంధం లేకుండా అంతరాలయ దర్శనానికి టిక్కెట్ పెట్టడం జరిగింది
- దీని వల్ల భక్తులకు మేలు కలుగుతుంది
- అవాస్తవాలు ఎల్లో మీడియా రాస్తోంది
- దేవాలయాల్లో అవినీతి లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తున్నాం
- దేవాలయాలు కూలగొట్టిన చంద్రబాబుకి ఏం తెలుసు దేవాలయాల గురించి
- ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఈనాడు ఉద్దేశపూర్వకంగా విషపు రాతలు
- దేవుడు ఆస్తులను కాపాడడానికి దేవాదాయ శాఖలో ప్రత్యేకంగా చట్టం చేశాం
- ఏనాడైనా దాని గురించి ఈనాడు పత్రిక, ఎల్లో మీడియా ప్రచురించారా?
- చంద్రబాబు ఏనాడైనా అర్చక స్వాములకు ఒక్క రూపాయి పెంచిన దాఖలాలు ఉన్నాయా?
- 5 వేల నుంచి 10వేలకు, 10 వేలు తీసుకునే అర్చకులకు 15 వేలు పెంచడం జరిగింది
- రాష్ట్రంలో వేల సంఖ్యలో ఆలయాలకు నిత్య పూజలు జరగాలని ధూప దీప నైవేద్యం అందచేస్తున్నాం.
- దుర్గమ్మ గుడి ఆలయ అభివృద్ధి దూర దృష్టితో మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది
- సింహచలంలో రూ.215 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం
- ప్రజల్ని కేవలం ఓట్లు వేసే యంత్రాలాగా చూసే వ్యక్తి చంద్రబాబు
- 8 ఆగమాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో హోమం చేయడం జరిగింది.
- దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయాల్లో ధర్మ ప్రచారం జరుగుతోంది
01:44 PM, Feb 4, 2024
సిద్దం సభలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకు: మంత్రి వేణు
- నిజమే పేదవాడికి రక్షణ.. నిజాన్ని గెలిపిస్తే పేదలకు మేలు జరుగుతుందని జగన్ భావించారు
- సిద్దం సభలతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతుంది
- చిరంజీవి పార్టీ పెట్టారు.. మొదటి సారి ఓటమి చెందారు
- రెండో సారి పోటీ చేసి గెలవాలనుకోలేదు
- మా వల్ల కాదని పార్టీ మూసేశారు
- అన్నయ్య పార్టీ మూసేస్తే తమ్ముడు పార్టీ పెట్టారు
- ఎదుట వాడికి జెండా మోయడమే ఆయన ఎజెండా
- పేదలకు మంచి చేసి..వారి జీవితాల్లో వెలుగులు నింపాలకుంటున్న జగన్ను ఓడించాలకుంటున్నారు పవన్
- పవన్ ఒకసారి తనకు తాను ప్రశ్నించుకోవాలి
01:09 PM, Feb 4, 2024
కుప్పం కూడా గెలవబోతున్నాం: మాజీ మంత్రి వెల్లంపల్లి
- సిద్ధం సభ ద్వారా సీఎం జగన్ మమ్మల్ని ఎన్నికలకు సంసిద్ధం చేశారు
- లక్షలాది మంది కార్యకర్తలు సిద్ధం సభకు తరలివచ్చారు
- చంద్రబాబు.. పవన్ కలిసి పెట్టినా ఇలాంటి సభ నిర్వహించలేరు
- మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్న దమ్మున్న నాయకుడు జగనన్న
- చంద్రబాబు, పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారు
- కుప్పం కూడా గెలవబోతున్నాం.. నిన్న సభే అందుకు ఉదాహరణ
- రాజకీయాల్లో సీఎం జగన్ పెద్ద స్టార్
- సీఎంజగన్ను చూసేందుకు యువత భారీగా తరలివచ్చారు
- గత ఐదేళ్లలో అభివృద్ధిని చంద్రబాబు గ్రాఫిక్స్లో చూపించాడు
- సీఎం జగన్ నిజమైన అభివృద్ధిని చూపించారు
- గత ఎన్నికల్లో 151 వచ్చాయి.. ఈ సారి 175 పక్కాగా సాధిస్తాం
12:45 PM, Feb 4, 2024
దెందులూరు సిద్ధం సభ సూపర్ సక్సెస్: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- సీఎం జగన్ ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలు నెరవేర్చారు
- రెండున్నర లక్షల కోట్లతో ప్రజలందరికీ మేలు చేశారు
- ఏపీలో ఏ రాజకీయ పార్టీ ఇంతటి పెద్ద సభను నిర్వహించలేదు
- చంద్రబాబు, పవన్ తెలంగాణలో రాజకీయం చేస్తున్నారు
- వాళ్ల మధ్య సీట్ల పంపకమే ఓ కొలిక్కి రాలేదు
- 175కి 175 ఎమ్మెల్యేలు.. 25కి 25 ఎంపీలు గెలవడమే మా లక్ష్యం
- వచ్చే రెండు...మూడు నెలలు నిత్యం జనాల్లో ఉండేలా మా నాయకుడు దిశానిర్ధేశం చేశారు
- సీఎం జగన్ ఇచ్చిన స్తూర్తితో ప్రజల్లోకి వెళ్తాం.. లక్ష్యం చేరుకుంటాం
- ఇల్లు లేని పేదలు ఉండకూడదనేది సీఎం జగన్ ఆలోచన
- త్వరలో సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటిస్తారు
12:24 PM, Feb 4, 2024
ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- చంద్రబాబు కొత్త బిచ్చగాడు కాదు
- పదవీ కాంక్ష, పదవీ వ్యామోహం తప్ప.. పేదలకు చేసింది ఏమీ లేదు
- కులం,మతం పేరుతో రెచ్చగొట్టేందుకు 6న జీడీ నెల్లూరులో సభ పెట్టేందుకు వస్తున్నాడు
- ఇంగ్లీష్ మీడియం పెడితే పేదల జీవితాలు మారతాయని నమ్మిన వ్యక్తి సీఎం జగన్
- చంద్రబాబు.. షర్మిలను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కుటుంబాన్ని చీల్చుతున్నాడు
- పేదలు గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి సీఎం జగన్
- ప్రజలు అందరూ ఆయనకు అండగా ఉన్నారు
- జీడీ నెల్లూరు సీటు కేటాయించినందుకు సీఎం జగన్కు రుణపడి ఉంటా
- నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు పాదాభి వందనం చేస్తున్నా
11:55 AM, Feb 4, 2024
చంద్రబాబుకు మంత్రి కాకాణి సవాల్
- కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనకు క్లీన్చిట్ రావడంపై మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పందన
- నాపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణ కోరా
- చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలకు విచారణకు సిద్ధమా?
- చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ కోరగలరా?
- బాబు అవీనీతి పరుడు కాకుంటే సీబీఐ విచారణ కోరాలి
- చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేశారు
- నాపై ఆరోపణలు చేసిన వారికి సీబీఐ ఛార్జ్షీట్ చెంపపెట్టు
- విచారణకు నేను సిద్ధమని ఆనాడే కోర్టులో చెప్పా
- నాపై టీడీపీ దుష్ప్రచారం చేసింది
- మొదటి నుంచి విచారణ పారదర్శకంగా జరిగింది
- సీబీఐ విచారణలో కూడా నా పాత్ర లేదని తేలింది
11:30 AM, Feb 4, 2024
ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ కామెంట్స్
- నేను చంద్రబాబు గురించి తెలుసుకున్నా..
- ఓడిపోతే చంద్రబాబు అసహనానికి గురవుతారు..
- చంద్రబాబుతో నాకు ఫ్రెండ్ షిప్ కూడా ఉంది
- అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం కూడా..
- చంద్రబాబుతో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పాను
- కొద్ది రోజుల క్రితం ఆయన్ను (బాబు) కలవటం కూడా జరిగింది
- నేను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయటం లేదని, ఆ పని విడిచిపెట్టానని చెప్పాను
- ఇటు మీకు (చంద్రబాబు), అటు సీఎం జగన్కు ఎలాంటి మద్దతు ఇవ్వలేను
- (మీరు గెలుపు-ఓటములలో నా ప్రమోయం ఉండదు)
11:13 AM, Feb 4, 2024
చరిత్రను సీఎం జగన్ తిరగరాశారు: గూడూరి ఉమాబాల
- భీమవరం మావుళ్ళమ్మను దర్శించుకున్న వైఎస్సార్సీపీ నర్సాపురం పార్లమెంటరీ సమన్వయకర్త ఉమాబాల
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంథిశ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమాబాల
- రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నరసాపురం పార్లమెంట్ సీటును బీసీ మహిళకు కేటాయించి సీఎం జగన్ చరిత్రను తిరగరాశారు.
- ఎంపీ సీటును బీసీ మహిళయిన తనకు కేటాయించినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు.
- బీసీలకు అత్యంత ప్రాధాన్యత కల్పించింది సీఎం జగన్ మాత్రమే
- ప్రజలందరి సహకారంతో నరసాపురం ఎంపీ సీటును సీఎంకు కానుకగా ఇస్తాం
11:02 AM, Feb 4, 2024
ఎన్నికల యుద్దం మొదలైంది: రావెల కిషోర్బాబు
- సంపన్న వర్గాలకు, వెనుక బడిన వర్గాలకు మధ్య జరుగుతున్న యుద్దం
- సమాజాన్ని ప్రక్షాళన చేయాలని, అవినీతి రాజకీయాలకు చరమగీతం పాడాలని జగన్ ప్రయత్నిస్తున్నారు
- అంబేద్కర్ ఆశయాలను జగన్ ముందుకు తీసుకెళ్తున్నారు
- 120 సంక్షేమ కార్యక్రమాల ద్వారా 2,55,000 కోట్ల రూపాయలను నేరుగా లబ్దిదారులకు అందుతున్నాయి.
- ప్రపంచంలోనే ఇదొక రికార్డ్
10:59 AM, Feb 4, 2024
ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు: మంత్రి పెద్దిరెడ్డి
- 2024 ఎన్నికల్లో చంద్రబాబు,నారా లోకేష్ గెలిచిపోయినట్లు కలలు కంటున్నారు.
- ఎవరికి ఏ శాఖ కావాలో కాగితాలపై రాసుకుంటున్నారు
- రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయం
- అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని ప్రజలు నమ్మరు
- టికెట్టు ఇవ్వనివారు అసంతృప్తితో వెళ్లడం సహజం
- కాంగ్రెస్ పార్టీ అవసాన దశకు చేరుకుంది
- ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారు
- తిరుపతి: అటవీశాఖ వన సంరక్షణ వాహనాలను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- 70 డివిజన్ల కోసం వాహనాలను కొనుగోలు
10:52 AM, Feb 4, 2024
మాడుగులలో టీడీపీ, జనసేనకు ఎదురుదెబ్బ
- డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలోకి జనసేన, టీడీపీ నాయకులు చేరిక
- వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన దుకాణం మూసుకోవాల్సిందే: ముత్యాల నాయుడు
- వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం నల్లేరు మీద నడకే
- ఏలూరు సిద్ధం సభతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి
- మారుమూరు గ్రామలకు సైతం అభివృద్ధిని సీఎం జగన్ తీసుకువెళ్తున్నారు
- సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు..
10:36 AM, Feb 4, 2024
మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
- నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సీబీఐ
- ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్ లో పేర్కొన్న సీబీఐ
- మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్ షీట్లో తెలిపిన సీబీఐ
- ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు
- 88 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ
- సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ
- మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన సీబీఐ
- ఏపీ పోలీసుల విచారణను సమర్థించిన సీబీఐ
- పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్ లను దోషులుగా నిర్ధారించిన సీబీఐ
- దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్ లో స్పష్టం చేసిన సీబీఐ
- హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో సీబీఐ విచారణ
- సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో ముందే చెప్పిన మంత్రి కాకాణి
- సీబీఐ విచారణ జరపాలని హైకోర్టులోను కోరిన మంత్రి కాకాణి
- సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి తెలిపిన అడ్వకేట్ జనరల్
- సీబీఐ ఛార్జ్ షీట్ తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్
- రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్ షీట్ తో పటాపంచలు
10:06 AM, Feb 4, 2024
దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం
- అందుకు ప్రతి కార్యకర్తా సైనికుడై కదలాలి
- రాష్ట్రంలో మరోసారి సంక్షేమ పాలన సాధిద్దాం
- సిద్ధం సభలో వైఎస్సార్సీపీ నేతల పిలుపు
- గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి
- పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు.
- వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా..
- ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు
- కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.
- గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా..
- ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే
9:44 AM, Feb 4, 2024
అరవయ్యా.. ఇరవయ్యా..!
- జనసేన–టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ
- అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు
- ఎన్ని సీట్లలో, ఏ సీట్లలో జనసేన పోటీచేస్తుందో తెలీక పార్టీలో నిస్తేజం
- ఎన్నికల ముందు దయనీయ పరిస్థితి
- 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం
- చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగ్లు పెట్టి కూడా నెలరోజులపైనే..
- పార్టీని పవన్ మోసం చేస్తున్నారని అభిమానుల ఆగ్రహం..
- చివరి నిమిషంలో అరకొర సీట్లు తీసుకునేందుకే కాలయాపన అంటూ మండిపాటు
8:35 AM, Feb 4, 2024
టీడీపీ వెన్నులో వణుకు..
- వైఎస్సార్సీపీ ‘సిద్ధం’ సభల జయప్రదంతో అంతర్మథనం
- చంద్రబాబు రా.. కదలి రా.. విఫలంపై ఆవేదన
- ‘సిద్ధం’ పేరుతో నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావ సభలు
- తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి
- ఈ సభలు జరుగుతున్న తీరు, వాటికి వస్తున్న జనాన్ని చూసి వారు గెలుపుపై ఆశలు వదిలేసుకుంటున్న టీడీపీ
- జగన్ జన బలం సుప్రసిద్ధమే
- అయితే గత వారం భీమిలిలో జరిగిన సభతో పాటు శనివారం దెందులూరులో నిర్వహించిన సభ అంతకుమించి సూపర్ సక్సెస్
- రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం
- దీంతో పూర్తిగా అంతర్మథనంలో పడిపోయిన టీడీపీ
- ‘రా కదలి రా’ అట్టర్ ఫ్లాప్తో ఆవేదన
7:58 AM, Feb 4, 2024
చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మరు: మాజీ ఎంపీ ఉండవల్లి
- ఉచితాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని ప్రకటించిన చంద్రబాబు
- అంతకంటే ఎక్కువ డబ్బులు పంచుతానని చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
- సంక్షేమ పథకాలకు ఇంత పెద్దమొత్తంలో నగదు బదిలీ చేసిన చరిత్ర ఇప్పటి వరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు
- జగన్ కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలన్నీ రద్దవుతాయని, తాము నష్టపోతామనే అవగాహన ప్రజలకు ఉంది
- అందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని గెలిపించుకోవాలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు
- అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో బీజేపీ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది
7:35 AM, Feb 4, 2024
నారాయణ ఎన్నికల కు‘తంత్రం’
- విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ కాల్స్
- కుటుంబ సమాచారంతోపాటు ఓటర్ ఐడీకార్డు నంబర్ల సేకరణ
- నారాయణ విద్యాసంస్థలను ఎన్నికల కేంద్రాలుగా మార్చేసుకున్న వైనం
- ఉద్యోగుల ద్వారానే ఎన్నికల సమాచారం సేకరణ
7:14 AM, Feb 4, 2024
జగన్ ప్రభం‘జనం’
- మరోసారి చాటిచెప్పిన ఏలూరు ‘సిద్ధం’ సభ కిక్కిరిసిన 110 ఎకరాల ప్రాంగణం
- సభా ప్రాంగణంలో ఖాళీ లేక జాతీయ రహదారిపై నిలబడిన లక్షలాది మంది
- విజయవాడ వైపు 15 కి.మీలు.. రాజమహేంద్రవరం వైపు 17 కి.మీల మేర నిలిచిన వాహనాలు
- హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు యువతే
- జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని విశ్వసిస్తోన్న యువత
జనగోదావరిగా మారిన దెందులూరు సిద్ధం సభ🔥
ఇలాంటి జనసందోహాన్ని మీ జీవితంలో ఎప్పుడైనా చూశారా @JaiTDP, @JanaSenaParty?
#Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/sCiBCtwuYy— YSR Congress Party (@YSRCParty) February 3, 2024
7:08 AM, Feb 4, 2024
మీరే సారథులు
- సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వమే రావాలి
- మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధం కావాలి
- దెందులూరు ఎన్నికల శంఖారావ సభలో సీఎం వైఎస్ జగన్ పిలుపు
- మీ జగన్ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే
- 57 నెలల్లో జరిగిన మంచిపై పెత్తందారులు దాడి చేస్తున్నారు
- సంక్షేమాభివృద్ధిపై దండయాత్ర చేస్తున్నారు
- 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి
- మన ప్రభుత్వ హయాంలోనే 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- కొత్తగా ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్లు..
- ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత మన హయాంలోనే
- ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మళ్లీ లంచాల వ్యవస్థ వస్తుంది
- పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలని అందరికీ చెప్పండి
- కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత కొనసాగాలంటే మళ్లీ మనం గెలవాలి
సిద్ధమా….!
మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా…?
పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన @YSRCParty ని మరోసారి గెలిపించేందుకు మీరంతా సిద్ధమా? #Siddham#YSRCPAgain#VoteForFan pic.twitter.com/BPqVPQVrYh— YS Jagan Mohan Reddy (@ysjagan) February 3, 2024
7:02 AM, Feb 4, 2024
ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతల టెన్షన్ టెన్షన్
- వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం చూస్తోన్న టీడీపీ
- పార్ధసారథి, వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిక ఖాయమంటున్న పార్టీ నేతలు
- తిరువూరు నియోజకవర్గంలో తెరపైకి కొలికలపూడి శ్రీనివాసరావు
- ఆందోళనలో ప్రస్తుత తిరువూరు ఇంచార్జ్ శావల దేవదత్
- పార్ధసారథిని నూజివీడుకి ఒప్పించేందుకు టీడీపీ హైకమాండ్ నానా హైరానా
- మైలవరం, పెనమలూరు టీడీపీ నేతల్లో ఉత్కంఠ
- దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్
- ఒకరికి పెనమలూరు, మరొకరికి మైలవరం కేటాయించేందుకు ప్రయత్నాలు
- ఇప్పటికే ఈ రెండు నియోజకవర్గాల్లో వివిధ ఏజెన్సీల ద్వారా హైకమాండ్ సర్వేలు
- విజయవాడ పశ్చిమ టీడీపీ లో గందరగోళం
- బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ పోటాపోటీ బల ప్రదర్శనలు
- పొత్తులో భాగంగా జనసేన కు ఇచ్చే సీట్లపై రాని క్లారిటీ
- విజయవాడ పశ్చిమ, అవనిగడ్డలు జనసేనకు అంటూ ప్రచారం
- నూజివీడులో ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు
- తనని విస్మరిస్తే ఇండిపెండెంట్గా బరిలో దిగుతానంటూ ముద్రబోయిన హెచ్చరికలు
7:01 AM, Feb 4, 2024
టీడీపీ, జనసేన మధ్య పొత్తుల కత్తులు
- ఉమ్మడి కృష్ణాలో మూడు సెగ్మెంట్లపై టీడీపీ, జనసేన మధ్య టికెట్ల పితలాటకం
- కృష్ణా జిల్లా అవనిగడ్డ, పెడన స్థానాలపై జనసేన ఫోకస్
- ఇన్ ఛార్జ్ లేకపోయినప్పటికీ అవనిగడ్డలో జనసేనకు కేడర్
- అవనిగడ్డ టికెట్ ఆశిస్తోన్న జనసేన నేత బండ్రెడ్డి రాము
- టీడీపీ నుంచి రేసులో మండలి బుద్ధ ప్రసాద్
- పెడన స్థానంలో బలంగా ఉన్న టీడీపీ, జనసేన
- పెడన ఇన్ఛార్జ్గా పంచకర్ల రమేష్ ను నియమించిన పవన్
- జనసేనలో చేరి పెడన నుంచి బూరగడ్డ వేదవ్యాస్ పోటీ?
- ఎన్టీఆర్ జిల్లాకు కీలక స్థానం విజయవాడ పశ్చిమ
- టికెట్ కోసం జనసేన ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ ప్రయత్నాలు
- ఇప్పటికే టీడీపీ నుంచి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ బలప్రదర్శన
- పవన్ ను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరిన జలీల్ ఖాన్