నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట

Aug 6 2026 12:51 AM | Updated on Aug 6 2026 12:51 AM

–10లో నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరుబాట ● నేటి నుంచి రిలే దీక్షలు

–10లో
● నేటి నుంచి రిలే దీక్షలు

పార్వతీపురం రూరల్‌ : డీఎస్సీ అర్హులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. నిరుద్యోగులకు అండగా నిలుస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం నుంచి ఆదివారం వరకు (ఆగస్టు 6 నుంచి 9వ తేదీ వరకు) నాలుగు రోజుల పాటు స్థానిక వైఎస్సార్‌ విగ్ర హం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారథ్యంలో రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతాయి. తొలి రోజైన గురువారం ఉద యం బలిజిపేట మండల యువత, మధ్యాహ్నం పార్వతీపురం పురపాలక సంఘం యువత ఈ శిబిరం దీక్షలో కూర్చుంటారు. యువత, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మె ల్యే అలజంగి జోగారావు ఒక బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement