మెరకముడిదాం: మండలంలోకి ఆదివారం సాయంత్రం ప్రవేశించిన ఏనుగుల గుంపు సోమవారం సాయంత్రానికి ఎం.రావివలస మీదుగా రామాయవలస, గొల్ల లమర్రివలస గ్రామాల మధ్యలో ఉన్న మామిడితోటలోకి ప్రవేశించినట్లు ఎలిఫెంట్ ట్రాకర్స్ సాయి, చంటి, ఉపేంద్ర, నాగ చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు సులోచనారాణి ఏనుగుల గుంపు ఉన్న సమీపంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా రామాయవలస, గొల్లలమర్రివలస గ్రామాల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారిని అప్రమత్తం చేయాలని తమ సిబ్బందికి తహసీల్దార్ సులోచనా రాణి సూచించారు.


