రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక
బాడంగి: రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన విజవాడలో జరగనున్న సీఎం పరేడ్కు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి వివిధ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణచెప్పారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ బాలుర గురుకులంలో జిల్లాతరఫున విద్యార్థులను మంగళవారం ఎంపికచేశామన్నారు. ఉమ్మడి జిల్లాలోని కొప్పెర్ల, బాడంగి, పార్వతీపురం, సాలూరు, పాలకొండ గురుకుల పాఠశాలలనుంచి 15మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 8మందిని ఎంపికచేశామని తెలిపారు. ఎంపికచేసిన విద్యార్థులు వచ్చేనెల 3వ తేదీన ఏలూరు జిల్లా పెదవేమలిలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలో పాల్గొననున్నట్లు చెప్పారు.
చెరుకు పంట దగ్ధం
బలిజిపేట: మండలంలోని పి.చాకరాపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న చెరుకు పంట ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మురగడాం గ్రామానికి చెందిన కౌలు రైతు ఎం.వెంకటినాయుడు పంట దగ్ధమైంది. రెవెన్యూ లెక్కల ప్రకారం ఈ ప్రమాదంలో 3.95ఎకరాల విస్తీర్ణంలో పండిన చెరుకుపంట సుమారు 200టన్నులు ఉంటుందని అంచనా. దీనిప్రకారం రైతుకు సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. కౌలు రైతు వెంకటినాయుడు పార్వతీపురానికి చెందిన డి.దాలినాయుడు వద్ద భూమి కౌలుకు తీసుకుని పంట పండిస్తున్నాడని కౌలు రైతుకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం కౌలురైతును ఆదుకోవాలని కోరుతున్నారు.
రెచ్చిపోతున్న బ్యాటరీ దొంగలు
రామభద్రపురం: మండలంలో వాహనాల బ్యాటరీ దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల రోజూ ఏదో గ్రామంలో వాహనాల బ్యాటరీలు చోరీ జరిగిందంటూ సంబంధిత వాహనచోదకులు లబోదిబోమం టున్నారు. రెండు రోజుల క్రితం బూశాయవలసలో ట్రాక్టర్, ఆటోలకు చెందిన బ్యాటరీలు చోరీచేయగా సోమవారం రాత్రి స్థానిక సాయినగర్లోని గుడ్ల కాంట్రాక్టర్ బండారు నాగరాజుకు చెందిన రెండు వ్యాన్లలోని రెండు బ్యాటరీలు దొంగలు చోరీ చేశారు.గతంలో కూడా ఒక వ్యాన్లో ఉన్న గుడ్లు చిదిమేసి, వ్యాన్కు చెందిన బ్యాటరీని దొంగలు ఎత్తికెళ్లిపోయారని గుడ్ల కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తాను పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు నాగరాజు తెలిపాడు. కొద్ది రోజులుగా వరుస సంఘటనలు జరుగుతున్నాయని, పోలీసులు నైట్ బీట్ సమయంలో నిఘాపెట్టాలని బాధితులు కోరుతున్నారు.
సీతానగరం: మండలంలోని గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో డిపాజిట్ చేసిన సొమ్మును చెల్లించి తమకు న్యాయం చేయాలని బాధితులు పోస్టాఫీస్ ఎదుట మంగళవారం ఆదోళన వ్యక్తం చేశారు. తామంతా వ్యవసాయ కూలిపనులు చేసుకుని వచ్చిన ఆదాయంలో కొంత సొమ్మును గెడ్డలుప్పి పోస్టాఫీస్లో ఆర్డీ రూపంలో 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి నెలకు రూ. 500 నుంచి రూ.1000 వరకూ కడుతున్నామన్నారు. దాచుకున్న సొమ్మును సంబంధిత పోస్టుమాస్టరు పోస్టాఫీస్లో కట్టకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎక్కువమంది ఆర్డీ డిపాజిట్ దారుల సొమ్ము కట్టకుండా దుర్వినియోగం చేశారని గతంలో పోస్టాఫీస్ వద్ద ఆందోళన చేసిన వారికి నగదు వాపసు చేశారని తమకు మాత్రం కట్టిన ఆర్డీ సొమ్ము ఇవ్వక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కొందరికి చెల్లింపులు చేసినా తమకు న్యాయం చేయాలని కొత్తవలస గ్రామానికి చెందిన నారికేళ్ల అప్పలనర్సమ్మ, గేదెల సోములమ్మ, యాండ్రపు చినతల్లి, బర్ల గంగమ్మ, నాగళ్ల లక్ష్మి, ముచ్చిపెదగౌరమ్మ, యాండ్రపు తిరుపతమ్మ కోరుతున్నారు. బాధితురాలు అప్పలనర్సమ్మ మాట్లాడుతూ తమసొమ్ముకు భధ్రత ఉంటుందని గ్రామ పెద్దలు చెప్పడంతో తామంతా వ్యయప్రయాసలకోర్చి అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు కొత్తవలస నుంచి గెడ్డలుప్పి పోస్టాఫీస్కు వెళ్లి కడితే అక్కడ కూడా భద్రత లేకపోవడంతో అవస్థలు పడుతున్నామని తమకు న్యాయం చేయాలని కోరారు. గెడ్డలుప్పి పోస్టు మాస్టరు వద్ద డిపాజిట్ల విషయమై ప్రస్తావించగా ఆర్డీ కట్టిన ఖాతాదారులు ఽఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాలని కోరామన్నారు.
రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక
రిపబ్లిక్ డే పరేడ్కు 8మంది విద్యార్థుల ఎంపిక


