ఇంకేం తినాలి.. బాబోయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఇంకేం తినాలి.. బాబోయ్‌!

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026 ఇంకేం తినాలి.. బాబోయ్‌! సత్తెనపల్లి: జిల్లాలో బియ్యం ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత మూడు నెలలుగా బహిరంగ మార్కెట్లో అన్ని రకాల బియ్యంపై ధరలు క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, అంతర్జాతీయ యుద్ధాల కారణంగా సరఫరాపై ఒత్తిడి ఏర్పడిందనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు వాటినే సాకుగా చూపించి ధరలను మరింత పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాభావ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యం కావడం, సాగు విస్తీర్ణం తగ్గడం, దిగుబడిపై అనిశ్చితి వంటి కారణాలతో మార్కెట్లో ముందస్తు భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని బియ్యం ధరలు ఒక్కసారిగా పెరగడంతో ప్రతి కుటుంబంపై నెలకు వందల రూపాయల అదనపు భారం పడుతోంది. భారీగా అక్రమ నిల్వలు... బియ్యం వ్యాపారాన్ని ప్రధానంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు నియంత్రిస్తున్నారనే అభిప్రాయం మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ధాన్యాన్ని పెద్ద మొత్తంలో సేకరించి జిల్లాలోని మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారని, మార్కెట్‌లో సరఫరాను పరిమితం చేస్తూ ధరలను క్రమంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. నియంత్రణలో ప్రభుత్వం విఫలం బియ్యం ధరలు వరుసగా పెరుగుతున్నప్పటికీ వాటిని అదుపులోకి తీసుకొచ్చే విషయంలో ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, సివిల్‌ సప్లయిస్‌, విజిలెన్స్‌ శాఖల అధికారుల తనిఖీలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని వినియోగదారుల సంఘాలు పేర్కొంటున్నాయి. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్‌రీల్‌

ప్రజలపై భారమే భారం...

అంతర్జాతీయ పరిణామాలు, ప్రకృతి విపత్తులు, సాగులో అనిశ్చితి వంటి అంశాల ప్రభావం చివరకు సామాన్యుడిపై పడుతోంది. రోజువారీ అవసరమైన బియ్యమే భారంగా మారడంతో చివరకు నూకలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బియ్యం ధరలు పెరగడంతో కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ గాడి తప్పుతోంది. ఇప్పటికై నా ధరల నియంత్రణకు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

కొత్త బియ్యమే దిక్కు

సాధారణంగా ఎక్కువ మంది వినియోగదారులు పాత బియ్యానికే ప్రాధాన్యం ఇస్తారు. అయితే ప్రస్తుతం పాత బియ్యం లభ్యత తగ్గిపోవడంతో కొత్త బియ్యాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పాత, కొత్త బియ్యం రెండింటి ధరలనూ పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంలో కూడా యంత్రాంగం విఫలమైంది.

గురువారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2026

మూడు నెలల్లోనే 25 కేజీల

బస్తాపై భారీగా పెంపు

ధరల నియంత్రణకు చర్యలు

చేపట్టని సర్కారు

ఎల్‌నినో, యుద్ధాల సాకుతో

అమాంతం పెంచిన వ్యాపారులు

నిఘా లేక, తనిఖీలు చేపట్టకుండా

అధికారుల చోద్యం

సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై

తీవ్ర ప్రభావం

అమ్మకానికి సిద్ధంగా ఉన్న బియ్యం బస్తాలు

బియ్యం ధర దడ పుట్టిస్తోంది. కనీసం నూకలు కొందామన్నా బాబోయ్‌ అనిపిస్తోంది. ధరలన్నీ మండిపోతుంటే సామాన్య ప్రజలు ఏం కొంటాం, ఏం తింటాం అంటూ నిట్టూరుస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా బియ్యం ధరలు పెరిగాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. 25 కేజీల బియ్యం బస్తాపై రూ.300 నుంచి రూ.400కుపైగా పెరిగిందని, దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల నియంత్రణపై పాలకులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement