
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు చేరువకండి
నరసరావుపేటటౌన్: ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువ కావాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పోలీసు సిబ్బందికి సూచించారు. మంగళవారం వన్టౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. దీర్ఘకాలిక పెడింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. విచారణలో ఉన్న కేసుల పురోగతి, దర్యాప్తు అంశాలను పరిశీలించారు. విచారణ దశలో ఉన్న ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులకు సంబంధించి పెండింగ్కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరక్కుండా సమస్యాత్మక ప్రదేశాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ పోలీస్ సిబ్బంది సహకారంతో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టంపై దృష్టి సారించాలన్నారు. సైబర్ నేరాలు, లోన్యాప్ మోసాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలు మోసగాళ్ల బారిన పడకుండా కాపాడాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.నాగేశ్వరరావు, సీఐలు ఎం.వి.చరణ్, హైమారావు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు
పలు పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు