దేశంలో రెండు నెలలుగా కోవిడ్ కేసులు అక్కడక్కడా నమోదవుతున్నాయి. అయితే రెండు మూడు వారాల నుంచి కోవిడ్ డిఫరెంట్గా సీరియస్నెస్ కనిపిస్తోంది. ఈ సారి జ్వరం ఎక్కువగా రావడం, ఆయాసం వంటి లక్షణాలు ఉంటు న్నాయి. కోవిడ్ మొదటి, రెండో వేవ్ అంత తీవ్రత ఉండకపోవచ్చు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గతంలో కోవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మళ్లీ పాటిస్తే మంచిది. క్యాన్సర్, మధుమేహం బాధితులు, రక్తపోటు ఉన్న వారు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.
– డాక్టర్ ఎం.రవీంద్రనాథ్,
శ్వాసకోశ వ్యాధుల నిపుణుడు


