మారిషస్‌ పద్మం

Sanjeeva Narasimha Appadu: Mauritius Star and Key Of Indian Ocean - Sakshi

మారిషస్‌ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘మారిషస్‌ స్టార్‌ అండ్‌ కీ ఆఫ్‌ ఇండియన్‌ ఓషన్‌’  పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్‌ స్వాతంత్య్ర  దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది మారిషస్‌ ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది అక్కడి ప్రభుత్వం. మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ జగన్నాథ్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకుంటున్నారు.

‘ఒక్క ఆంగ్ల పదం మాట్లాడకుండా తెలుగు మాట్లాడతాను, మీరు మాట్లాడగలరా’ అంటూ  సవాలు చేస్తూ ఉంటారాయన. ‘జై జై జై తెలుగు తల్లీ’ అని అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ ఉంటారు. ప్రపంచ తెలుగు మహాసభలకు తప్పనిసరిగా హాజరవుతారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. 
– చల్లా రామఫణి, మొబైల్‌:  9247431892

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top