breaking news
mauritius telugu association
-
మారిషస్ పద్మం
మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషా యోధుడు సంజీవ నరసింహ అప్పడుకు ‘మారిషస్ స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రతి సంవత్సరం మారిషస్ స్వాతంత్య్ర దినోత్సవమైన మార్చి 12వ తేదీన తొమ్మిది మంది మారిషస్ ప్రముఖులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది అక్కడి ప్రభుత్వం. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకుంటున్నారు. ‘ఒక్క ఆంగ్ల పదం మాట్లాడకుండా తెలుగు మాట్లాడతాను, మీరు మాట్లాడగలరా’ అంటూ సవాలు చేస్తూ ఉంటారాయన. ‘జై జై జై తెలుగు తల్లీ’ అని అందరినీ స్నేహపూర్వకంగా పలకరిస్తూ ఉంటారు. ప్రపంచ తెలుగు మహాసభలకు తప్పనిసరిగా హాజరవుతారు. ఈ పురస్కారం భారత దేశంలోని ‘పద్మ’ పురస్కారాలతో పోల్చదగినది. – చల్లా రామఫణి, మొబైల్: 9247431892 -
మారిషస్ లో వేంకటేశ్వర స్తోత్రాలు
మాతృభూమికి దూరంగా ఉంటున్నప్పటికీ మారిషస్ లోని తెలుగువారు తమ సంప్రదాయాలను పదిలంగా కాపాడుకుంటున్నారు. పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ఉనికిని చాటి చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రవాస తెలుగువారిని భక్తిసాగరంలో ఓలలాడించింది. మారిషస్ చరిత్రలో తొలిసారిగా చిన్నారులతో శ్రీ వేంకటేశ్వరస్వామి స్తోత్రముల ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 4 నుంచి 13 ఏళ్ల బాల బాలికలు 450 మంది రాగ, తాళ, భావ, అర్థయుక్తంగా ఆలాపించిన స్తోత్రములు భక్తులకు వీనులవిందు చేశాయి. జూలై 28 నుంచి 30 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రవాసులకు పరమానందం కలిగించింది. లేస్కలియే, వల్లెట్ట, పాంప్లెముసేజ్ తెలుగు సంఘాలు ఈ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో ఎంపిక చేసిన చిన్నారులకు తిరుమల వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల, హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, భద్రాచలంలో పాడేందుకు చిన్నారులకు అవకాశమిచ్చారు.