జిల్లాలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆగస్టులో జిల్లా వ్యాప్తంగా 88 కేసులు నమోదు కాగా, ఈ నెల 11వ తేదీ వరకు 52 మంది డెంగీ బారినపడ్డారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 161 డెంగీ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా వీటి పరిధిలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆర్మూర్ పీహెచ్సీ పరిధిలో 15, రాకాసీపేట 10, అర్సపల్లి 7, దుబ్బా 9, పాన్గల్లి 9, ఇందల్వాయి 9, మెండోరా, మోస్రా, పోతంగల్ తదితర పీహెచ్సీల పరిధిలో ఏడు చొప్పున కేసులు నమోదయ్యాయి. డెంగీతోపాటు రెండు చికున్గున్యా కేసులు సైతం నమోదు కావడం గమనార్హం.


